అంబేద్కర్ సమానత్వానికి ప్రతీక.. టీఆర్ఎస్ నేత వద్దిరాజు కిషన్

by Dishafeatures2 |
అంబేద్కర్ సమానత్వానికి ప్రతీక.. టీఆర్ఎస్ నేత వద్దిరాజు కిషన్
X

దిశ, మహబూబాబాద్ ప్రతినిధి: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సమానత్వానికి ప్రతీక అని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, గాయత్రి గ్రానెట్స్ అధినేత వద్దిరాజు కిషన్ అన్నారు. మంగళవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఇనుగుర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వద్దిరాజు కిషన్ మాట్లాడుతూ.. భావి తరాల భవిష్యత్తును ముందే తలచి డాక్టర్ అంబేద్కర్ అద్భుతమైన రాజ్యాంగాన్ని రచించారని తెలిపారు. అంబేద్కర్ ఆలోచనలు ఎల్లప్పుడూ య అత్యంత ఆదర్శనీయమని చెప్పారు. అంబేద్కర్ ఆలోచనల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితో ఇవాళ సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రామ్మూర్తి, టీఆర్ఎస్ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


Next Story