నిజాం నిరంకుశ పాలనపై ఎక్కుపెట్టిన ఫిరంగి పరకాల : రేవంత్ రెడ్డి

by Aamani |
నిజాం నిరంకుశ పాలనపై ఎక్కుపెట్టిన ఫిరంగి పరకాల : రేవంత్ రెడ్డి
X

దిశ, హనుమకొండ టౌన్ : మచ్చలేని నాయకుడు , అవినీతి మరక లేని నాయకుడు రేవూరి ప్రకాష్ రెడ్డి అని, నిజాం నిరంకుశ పాలనపై ఎక్కుపెట్టిన ఫిరంగి గడ్డ పరకాల అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం పరకాలలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. నిజాం నిరంకుశ పాలనపై ఎక్కుపెట్టిన ఫిరంగి పరకాల గడ్డ అని, తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ సార్ పుట్టిన గడ్డ పరకాల నియోజకవర్గం అని అన్నారు. అలాంటి ఈ గడ్డను ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని, మచ్చలేని , అవినీతి మరక లేని నాయకుడు రేవూరి ప్రకాష్ రెడ్డి అని అన్నారు.

కేసీఆర్ మతి తప్పి మాట్లాడుతుండో, మందేసి మాట్లాడుతుండో తెలియదు అంటూ, ఇందిరమ్మ రాజ్యాన్ని తప్పుపడుతుండు అని మాట్లాడాడు. దొరల రాజ్యం కావాలా..? ఇందిరమ్మ రాజ్యం కావాలా పరకాల ప్రజలు తేల్చుకోవాలి అన్నారు. ఆనాడు పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అని, ఇల్లు కట్టుకునే ప్రతి పేదవాడికి రూ.5లక్షలు ఉచితంగా ఇచ్చే రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అని అన్నారు. వేలాది ఎకరాల దొరల భూములను సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి పేదలకు పంచింది ఇందిరమ్మ రాజ్యం అంటూ, ఈ ప్రాంతంలో అభివృద్ధి ఇందిరమ్మ రాజ్యంలోనే జరిగింది అన్నారు. ఇందిరమ్మ రాజ్యాన్ని తప్పు పట్టిన కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి అని, సోనియమ్మ మాటంటే శిలాశాసనం అని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇచ్చినట్లే అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం అని ప్రజలకు మాట ఇచ్చారు.



Next Story

Most Viewed