తెలంగాణ హై కోర్టులో ఆదివాసీల‌కు అనుకూలంగా తీర్పు..

by Disha Web Desk 20 |
తెలంగాణ హై కోర్టులో ఆదివాసీల‌కు అనుకూలంగా తీర్పు..
X

దిశ, ఏటూరునాగారం : ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాలు రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ కిందకే వస్తాయని తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆదివాసీల తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ తన వాదనలు వినిపించారు. ఆదివాసీ, ఆదివాసియేతరులు వేసిన పిటిషన్ పై ఇవాళ సీజే ఉజ్జల్ భుయాన్ తో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. సింగిల్ జడ్జి బెంచ్ తీర్పును ఏకీభవించింది. ఆ తీర్పులో జోక్యం చేసుకోలేమంటూ తేల్చి చెప్పింది.

ఈ మేరకు ఆదివాసీ యేతరులు వేసిన అప్పీల్ పిటిషన్ కొట్టేసింది. ఐదో షెడ్యూల్ ప్రాంతంలోని గిరిజనులకు రాజ్యాంగం ప్రత్యేకమైన అధికారాలను కల్పించింది. ముఖ్యంగా భూమి మీద పూర్తిగా హక్కు లభిస్తుంది. ఆ ప్రాంతంలో ఖనిజ నిక్షేపాల తవ్వకానికి గిరిజనులకు మాత్రమే అనుమతులు ఇవ్వాలని, ప్రభుత్వం సైతం గిరిజనేతరుడిగానే పరిగణింపబడుతుందని కేసులో సుప్రీం వెల్లడించింది. దీంతో ములుగు జిల్లా మంగపేట మండలంలో ఆదివాసీలు సంబరాలు జరుపుకుంటున్నారు. గత 25 సంవత్సరాల నుండి ఎలక్షన్ జరగక అభివృద్ధి కుంటుపడిందని, వెంటనే ఎలక్షన్ లు నిర్వహించాలని ఆదివాసీలు కోరారు.

Advertisement

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channel



Next Story

Most Viewed