ఆదరణకు నోచుకోని అమరవీరుల స్థూపం

by Dishaweb |
ఆదరణకు నోచుకోని అమరవీరుల స్థూపం
X

దిశ,నెల్లికుదురు: తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రాణాలు సైతం అర్పించిన అమరయోధుల స్మారకార్థం నిర్మించిన అమరవీరుల స్థూపానికి ఆదరణ కరువైపోయింది.జూన్ 2 తెలంగాణ ఆవిర్భావదినోత్సవంలో దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటూ కనీసం ఉద్యమంలో పాలు పంచుకొని అమరులైన వీరులను స్మరించుకొని నివాళులర్పించకుండా వారి ప్రాణత్యాగాలని మర్చిపోయారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ అమరుల కు కనీసం నివాళులర్పించకుండా యాది మరవడంతో మండలంలోని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘనంగా సంబరాలు నిర్వహించుకొని శ్రద్ధ అమరవీరుల స్థూపానికి అలంకరణ కూడా నోచుకోలేదు.


Next Story

Most Viewed