- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
'హరితహారం మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండాలి'
దిశ ప్రతినిధి,వరంగల్ : వరంగల్ సర్కిల్ పరిధిలో తెలంగాణకు హరిత హారం కింద చేపట్టిన అర్బన్ పార్కులను, నర్సరీలను, ఫారెస్ట్లో మొక్కల పెంపకంపై అటవీ శాఖ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం వరంగల్ సర్కిల్లోని వరంగల్, హన్మకొండ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జనగాం జిల్లాలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా పలు రేంజ్ పరిధుల్లో పర్యటించిన ఆమె తెలంగాణకు హరిత హరం యొక్క లక్ష్యం ఒక కోటి మొక్కలని అన్నారు. అన్ని జిల్లాలలో గుంతలు తీయడం, మొక్కలు నాటడం వేగవంతం చేయాలని అన్నారు. ఆగష్టు నెలాఖరు కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇరిగేషన్ కెనాల్స్, బ్లాక్ ప్లాంటేషన్స్ ప్రత్యేకంగా రివ్యూ చేశారు. కార్యక్రమంలో వరంగల్ సర్కిల్ అటవీ అధికారి డాక్టర్ ఆశా, ములుగు జిల్లా అటవీ అధికారి ప్రదీప్ కుమార్ శెట్టి, భూపాలపల్లి జిల్లా అటవీ అధికారిని లావణ్య, హన్మకొండ జిల్లా అటవీ అధికారి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.