అర్హులైన రైతులకే రైతుబంధు : మంత్రి తుమ్మల

by Aamani |
అర్హులైన రైతులకే రైతుబంధు : మంత్రి తుమ్మల
X

దిశ, మంగపేట : రాష్ట్రంలోని అర్హులైన రైతులకే రైతుబంధు ఇవ్వనున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం మండల పర్యటనలో భాగంగా మండల కేంద్రంలో విలేకర్లతో మాట్లాడారు. యాసంగి సీజన్ కు సంబంధించిన నగదును రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఐదు ఎకరాలకు పైగా భూమి ఉన్న రైతాంగానికి సోమవారం నుండి నేరుగా ఎకరాకు రూ.5,000 చొప్పున కర్షకుల ఖాతాలో జమ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్అ మల్లో ఉన్నందున అధికారిక ప్రకటన విడుదల చేయలేదన్నారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధుపై విధివిధానాలు రూపొందించి అర్హులైన వారికి మాత్రమే రైతుబంధు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆయన వెంట భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఉన్నారు.

Next Story

Most Viewed