- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రమాదకరంగా విశ్రాంతి మండపం రోడ్డు

దిశ, మంగపేట : మల్లూరు గ్రామంలోని వాగు నుంచి హేమాచల లక్ష్మీనృసింహాస్వామి ఆలయానికి విశ్రాంతి మండపం మీదుగా వెళ్లే ప్రధాన రహదారి మూడేళ్ల కింద వచ్చిన భారీ వర్షాలకు కొట్టుకు ప్రమాదకరంగా మారింది. దీంతో నర్సింహాసాగర్, పూరెడుపల్లి, మల్లూరు పంచాయతీలకు చెందిన ప్రజలు కాలినడకన గుట్టకు వెళ్లే ఈ రహదారి పై నడిచి వెళ్లేందకు ఇబ్బందులు పడుతున్నారు. 2021 లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అజ్మీరా చందూలాల్ మల్లూరు ప్రధాన రహదారి కమాన్(ఆర్చీ) నుండి గుట్ట వరకు 4 కిలోమీటర్ల రోడ్డు డబుల్ లేన్ విస్తరణతో పాటు మల్లూరు వాగు నుండి విశ్రాంతి మండపం మీదుగా గుట్ట రోడ్డుకు కలిసేలా ఆర్ అండ్ బీ నుండి సుమారు 4 కోట్లను మంజూరీ చేసి రోడ్ల పనులను సాయిదత్త కన్స్ట్రక్షన్ కు అప్పగించి ప్రారంభించారు. ఐతే కిలోమీటరు వరకు రోడ్డు పనులు చేసిన తర్వాత ఫారెస్ట్ అధికారులు పనులను అడ్డుకోవడంతో గుత్తేదారు మధ్యలోనే ఆపి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే విశ్రాంతి మండపం రోడ్డు సైతం భారీ వర్షాల వరదలకు కొట్టుకొని పోయి నడిచేందుకు ప్రమాదకరంగా మారింది. దీంతో మూడు పంచాయతీలకు చెందిన ప్రజలు ఆ రోడ్డు పై కాలినడకన పోవాలంటే జంకుతున్నారు. ఇప్పటికైనా ఆర్ అండ్ బీ అధికారులు స్పందించి రోడ్డు పనులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.