ప్రభుత్వ ఉపాధ్యాయుడి పాడు పని... ఆలస్యంగా వెలుగులోకి!

by Dishanational1 |
ప్రభుత్వ ఉపాధ్యాయుడి పాడు పని... ఆలస్యంగా వెలుగులోకి!
X

దిశ, స్టేషన్ ఘన్ పూర్: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు అక్రమాలు, విద్యార్థినితో సంబంధం పెట్టుకున్నట్లు అధికారుల విచారణలో తేలడంతో సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.... జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలోని మోడల్ స్కూల్ లో ఆర్. శ్యాం కుమార్ అనే వ్యక్తి తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. 2018లో సిబ్బంది నియామకంలో తన చేతివాటం చూపించి రూ. 1 లక్ష 60 వసూలు చేసి అధికారుల విచారణలో దొరికిపోయాడు. అతడిని కొద్దిరోజుల పాటు విధులకు దూరంగా పెట్టిన అధికారులు తిరిగి 2019లో విధుల్లో చేర్చుకున్నారు. మోడల్ స్కూల్ లోని విద్యార్థినితో సంబంధం పెట్టుకుని ఈ నెల 17న బయటకు తీసుకెళ్లి రాత్రి వరకు తీసుకు రాలేదు. విషయం తెలిసిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. అనంతరం విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు, అధికారుల విచారణ అనంతరం సదరు ఉపాధ్యాయుడు ఆర్. శ్యాంసుందర్ ను సస్పెండ్ చేస్తున్నట్లు డీఓ రాము ఈ నెల 19న ఉత్తర్వులు జారీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


Next Story