ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు: మద్దెల యాదమ్మ

by Disha Web Desk 23 |
ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు: మద్దెల యాదమ్మ
X

దిశ, మరిపెడ (చిన్నగూడూరు ): మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రం లోని తన సాగు చేసుకునే భూమిలో అక్రమంగా రెండు పడక గదుల నిర్మాణం చేపడుతున్నారని దళిత మహిళ మద్దెల యాదమ్మ పెట్రోల్ బాటిల్ తో నిరసన వ్యక్తం చేస్తూ తన భర్త సమాధి పైన పడి నన్ను స్థానిక బి ఆర్ఎస్ నాయకులు ధారాసింగ్ , చెన్నయ్య మరియు స్థానిక ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని నాకు ఆత్మహత్య శరణ్యమని బోరున విలపించింది. తాను 10 లక్షల రూపాయలు వెచ్చించి ఈ భూమిని బాగు చేసుకున్నానని నా భూమి చుట్టూ ఉండే పెన్సిల్ ఇంగ్ మరియు పైపులైన్లను వేయించుకున్నానని వాటిని పలగ్గొడుతూ ఇక్కడ రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారని మేము అధికారంలో ఉన్నాము మాకు ఎదురు చెప్తే నీకు సెంటు భూమి లేకుండా చేస్తామని నన్ను భయభ్రాంతులకు అధికార పార్టీ నాయకులు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ నా భూమిలో నా అనుమతి లేకుండా ఇలా దౌర్జన్యంగా వ్యవహరిస్తున్న నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్న వీరి పైన ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది.

చిన్నగూడూరు గ్రామంలోని 129 సర్వే నెంబర్లలో మొత్తం 36 ఎకరాల 32 గుంటలు ఉండగా నాకు ఆరు ఎకరాలు 20 గుంటల భూమి వుంది అని అందులో కొంత వేరే వారి వద్ద నుంచి కొనుగోలు చేశామని అందుకు సంబంధించిన ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయని అంతేకాకుండా ఇక్కడ ఉన్న స్థానిక బీఆర్ఎస్ పార్టీ లీడర్లు తన వద్దకు వచ్చి నీ భర్త జ్ఞాపకార్ధంగా ఒక ఎకరం భూమిని పోలీస్ స్టేషన్ కి ఇవ్వాలి అని అడగగానే ఇస్తాను అని చెప్పి సంతకం కూడా చేశానని అప్పుడే వారి కన్ను మిగిత ఈ భూమి మీద పడింది అన్న విషయాన్ని నేను గ్రహించలేకపోయానని వాపోయింది. అలాగే నా కుమారుడుతో లోపాయి కారి ఒప్పందం చేసుకొని 129/9,129/10 సర్వే నెంబర్ల గల ఎకరం భూమిని ప్రభుత్వానికి నా కుమారుడు అప్పచెప్పితే ఆ భూమి ఎక్కడో ఉంటే ఇక్కడ డబుల్ బెడ్ రూమ్ కట్టడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించింది.

అలాగే సర్వే చేయాలని టీ పన్ను కట్టినా కూడా సర్వేరు నాకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నామమాత్రపు సర్వే చేశారని. సర్వే చేసే పద్ధతి ఇది కాదు అని నేను ప్రశ్నించగా ఆర్ డి ఓ చెప్పారని వచ్చానని డి. ఐ ( సర్వేయర్) తనకు చెప్పారని వివరించింది. మళ్లీ వస్తానని చెప్పి ఇప్పటివరకు రాలేదు అని ఇప్పుడు అధికారులు ఇది ప్రభుత్వ భూమి అని అంటున్నారని అసలు పూర్తిస్థాయిలో సర్వే చేయకుండానే ఏలా నిర్ధారిస్తారని ఇది ప్రభుత్వ భూమి అయితే 40 సంవత్సరాల నుంచి ఇక్కడ బోర్డు ఎందుకు ఏర్పాటు చేయలేదని పోలీస్ స్టేషన్ స్థలం కోసం నా దగ్గరికి ఎలా వచ్చారని ఆ బాధిత మహిళ ప్రశ్నిస్తూ తాను కాస్తులో వుంటూ భూమిని దున్నుకుంటూ తన జీవనం కొనసాగిస్తుంటే నాకు కనీసం నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా అధికారులు, స్థానిక బి ఆర్ఎస్ లీడర్లు ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారని నా భూమికి ఎదురుగా ఉండే అధికార బి ఆర్ ఎస్ పార్టీ నాయకుడు భూమికి అధిక ధర రావాలని ఉద్దేశంతోనే ఇలా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపణ వ్యక్తం చేసింది.వీరికి ఎమ్మెల్యే అండదండలు పుష్కలంగా ఉన్నాయని. స్థానిక బిఆర్ఎస్ లీడర్లు మరియు నా కుమారుడి తో నాకు ప్రాణహాని ఉందని నాకు అధికారులు న్యాయం చేసేవరకు ఈ నా పోరాటం ఆగదని ఈ సందర్భంగా హెచ్చరించింది.

ఇదే విషయమై స్థానిక ఎమ్మార్వో రామకృష్ణ వరప్రసాద్ ను వివరణ కోరగా తాను శతాబ్ది ఉత్సవాలు బిజీగా ఉన్నాను అని పూర్తి సమాచారాన్ని మీకు త్వరలో అందజేస్తానని వివరించడం జరిగింది.


Next Story

Most Viewed