మా సహనాన్ని పరీక్షించొద్దు.. బీజేపీకి మంత్రి ఎర్రబెల్లి వార్నింగ్

by Disha Web Desk 19 |
మా సహనాన్ని పరీక్షించొద్దు.. బీజేపీకి మంత్రి ఎర్రబెల్లి వార్నింగ్
X

దిశ, దేవరుప్పుల: బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సమస్యల కోసం కాకుండా తన పబ్లిసిటీ కోసం పాదయాత్ర చేస్తున్నాడని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. శుక్రవారం సీతారాంపురం గ్రామంలో మంత్రి మాట్లాడుతూ.. హిందూత్వ ముసుగులో బండి సంజయ్ గుండాలతో పాదయాత్ర చేస్తూ గుండాయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం కేసీఆర్ భారత స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకలకు దేశం నలుదిక్కులా చాటేలా నిర్వహించాలని పిలుపు ఇచ్చారని అన్నారు.

స్వాతంత్య్ర దినోత్సవం రోజున బండి సంజయ్ తన గూండాలతో దేవరుప్పులకు వచ్చి వేడుకలకు సిద్ధమవుతున్న టీఆర్ఎస్ కార్యకర్తలపై రాళ్లు, కట్టెలతో దాడి చేసి.. చేతులు, కాళ్లు విరిగి, తలలు పలిగేలా విచక్షణారహితంగా కొట్టి హింసాత్మక ఘటనకు ఒడిగట్టారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టానికి ఏం అభివృద్ధి చేసేందో బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. అర్థం పర్థం లేని పాదయాత్ర చేస్తూ ప్రజల్లో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులను తీసుకురావడంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పూర్తిగా విఫలమయ్యారని.. మాటలు మాట్లాడటం తప్ప చేతలు చేయని నాయకులని ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణ గలవారు కాబట్టి ఓర్పు, సహనంతో ఉన్నారని.. మా ఓర్పు, సహనాన్ని పరీక్షించొద్దని హెచ్చరించారు.



Next Story

Most Viewed