- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నిరుద్యోగులకు బీజేపీ సర్కార్ మోసం.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
దిశ, వరంగల్ టౌన్: నిరుద్యోగులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. వరంగల్ లోని మహేశ్వరి గార్డెన్ లో నన్నపునేని నర్సింహమూర్తి చారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న యువతకు మంత్రి స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటివరకు 2 లక్షల 25 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిందని తెలిపారు. ఇవేకాకుండా ప్రైవేట్ రంగంలో దాదాపు 17 లక్షలు ఉద్యోగాలు తమ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు.
కానీ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల పేరుతో దేశ యువతకు తీరని ద్రోహం చేసిందని మండిపడ్డారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా.. ఉన్న ఉద్యోగాలు తీసేసిందని ఫైర్ అయ్యారు. రిజర్వేషన్లు ఎత్తేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని మంత్రి ఆరోపించారు. బాగా చదివి ఉద్యోగాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, నన్నపనేని నర్సింహమూర్తి ట్రస్టీ నన్నపునేని వాణి నరేందర్ తదితరులు హాజరయ్యారు.