ఆదేశాలను తుంగలో తొక్కుతున్న మండల కార్యాలయాలు..

by Dishafeatures2 |
ఆదేశాలను తుంగలో తొక్కుతున్న మండల కార్యాలయాలు..
X

దిశ, కేసముద్రం: 75 వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాయి. వీటిలో భాగంగా ఈనెల 11వ తేదీ నుంచి 22వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుద్దీపాలతో కళకళలాడాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో ఆదేశాల మేరకు కేసముద్రం పోలీస్ స్టేషన్ విద్యుత్ దీపాల కాంతులతో కళకలలాడుతుంది. కానీ మండల కార్యాలయాలైన ఎంపిడివో, రెవెన్యూ ఆఫీసులు మాత్రం అంధకారంలో దర్శనమిస్తున్నాయి. జిల్లా అధికారులు ఆదేశించినా మండలంలో మాత్రం ఆదేశాలు అమలు కావనడానికి ఇది నిదర్శనంగా కనిపిస్తోంది. అన్ని గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యాలయాలు విద్యుద్దీపాలతో వెలుగుతుంటే మండల పరిషత్ కార్యాలయాలు మాత్రం చీకట్లో దర్శనమిస్తున్నాయి. ఇకనైనా అధికారులు స్పందించాలని ప్రజలు వేడుకుంటున్నారు. అన్ని గ్రామ పంచాయతీల్లో నియమ నిబంధనలను పాటించాలని చెప్పే అధికారులే నియమాలను పాటించకుంటే ఇక సామాన్యులు ఎలా పాటిస్తారని ప్రశ్నిస్తున్నారు.


Next Story

Most Viewed