ఎదిరిస్తే.. పింఛన్ కట్..

by Disha Web Desk 20 |
ఎదిరిస్తే.. పింఛన్ కట్..
X

దిశ, నర్సింహులపేట : నర్సింహులపేట మండలంలోని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కు నిరసన సెగ తగిలింది. మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండలంలోని గోపతండ గ్రామపంచాయతీ పరిధిలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో బుధవారం ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో రెడ్యానాయక్ మాట్లాడుతూ ఉండగా గోపతండలో కేసీఆర్ తమకు ఏం చేశాడని గిరిజన మహిళ నిలదీసింది. తండాలో సౌకర్యాలు లేవని నిలదీయడంతో కోపోదృక్తుడైన ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఈమె పెన్షన్ తీసివేయమని పంచాయతీ కార్యదర్శిని పురమాయించాడు. తండావాసులు పనుల విషయమై అడిగితే పించన్ కట్ చేయమని అనడం ఎంత వరకు సమంజసమని మండిపడుతున్నారు.



Next Story