పాతనేరస్థులు, రౌడీషీటర్లపై నిఘా పెట్టండి: సీపీ ఏవీ రంగనాథ్

by Disha Web Desk 11 |
పాతనేరస్థులు, రౌడీషీటర్లపై నిఘా పెట్టండి: సీపీ ఏవీ రంగనాథ్
X

దిశ, హన్మకొండ: చట్ట వ్యతిరేక కార్యకలపాలు నేరాలకు పాల్పడిన పాత నేరస్థులతో పాటు, రౌడీ షీటర్ల ప్రస్తుత కార్యకలాపాలపై నిఘా పెట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. నెలవారి నేర సమీక్షా సమావేశంలో భాగంగా శనివారం కమిషనర్ పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. డీసీపీ, ఏసీపీలు. ఇన్స్ స్పెక్టర్లు, ఎస్ఐలు పాల్గొన్న ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ పరిధిలో నమోదైన కేసుల ప్రస్తుత స్థితిగతులతో పాటు, ఈ కేసుల్లోని నిందితుల అరెస్ట్, కేసుల దర్యాప్తు, రికవరీ, కోర్టులో పెండింగ్ ఉన్న కేసులపై కమిషనర్ కేసుల వారీగా సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

యువతను మత్తుకు బానిసలుగా మారుస్తున్న మత్తు పదార్థాల, గంజాయి విక్రయాలను కట్టడి చేసేందుకుగాను ప్రతి పోలీస్ అధికారి మరింతగా శ్రమించాల్సి ఉంటుందని చెప్పారు. గంజాయి అమ్మకాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించి పీడీ యాక్ట్ కింద కేసులను నమోదు చేయాలన్నారు . నేరాల నియంత్రణకై ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో విజుబుల్ పోలీసింగ్ విభాగం నిరంతరం పోలీసులు గస్తీ నిర్వహించాలని చెప్పారు. బాల్య వివాహాలను నియంత్రించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, బాల్య వివాహలపై ఎవరు ఫిర్యాదు ఇవ్వకుంటే సంబంధిత స్టేషన్ అధికారి సుమోటో క్రింద కేసు నమోదు చేసుకోవాలన్నారు.
భ్రూణ హత్యల నివారణకై స్కానింగ్ సెంటర్లపై నిఘా పెట్టాలని, అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్ పాల్పడే వ్యక్తులను గుర్తించడంతో పాటు మహిళలు, బాలికల అదృశ్య కేసులపై అధికారులు తక్షణమే స్పందించాలని కమిషనర్ సూచించారు. స్టేషన్ అధికారులు ప్రజలతో సత్ససంబంధాలు పెట్టుకోవాలని అలాగే గ్రామాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు. సమావేశంలో డీసీపీలు అబ్దుల్ బారీ, కరుణాకర్, సీతారాం, అదనపు డీసీపీ పుష్పా రెడ్డి, సంజీవ్, సురేష్ కుమర్ తదితరులు పాల్గొన్నారు.



Next Story