ప‌శ్చిమ టికెట్ రేసులో వెన‌క్కి త‌గ్గ‌ని నేత‌

by Dishaweb |
ప‌శ్చిమ టికెట్ రేసులో వెన‌క్కి త‌గ్గ‌ని నేత‌
X

దిశ‌, హ‌న్మ‌కొండ : జ‌న‌గామ డీసీసీ మాజీ అధ్య‌క్షుడు, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జంగా రాఘ‌వ రెడ్డి దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం టికెట్ రేసులో తాను ఉన్న‌ట్లుగా శ్రేణుల‌కు సంకేతాలిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌ల్లో భాగంగా కాజీపేట‌, హ‌న్మ‌కొండ‌ల్లోని ప్ర‌ధాన కూడ‌ళ్లో ఆయ‌న ఫ్లెక్సీల‌ను ఏర్పాటు చేయ‌డం గ‌మ‌నార్హం. వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం టికెట్‌ను హ‌న్మ‌కొండ డీసీసీ అధ్య‌క్షుడు నాయిని రాజేంద‌ర్ రెడ్డి ఆశిస్తున్నారు.

జంగా రాఘ‌వ‌రెడ్డి సైతం బ‌రిలో ఉంటాన‌ని ప్ర‌క‌టించారు. కొద్దిరోజుల క్రితం ఇద్ద‌రూ పోటాపోటీగా రాహుల్ జోడోయాత్ర‌లోని సందేశాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో పోటాపోటీగా పాద‌యాత్ర‌లు చేప‌ట్టారు. అయితే ఈ విష‌యంపై నాయిని అధిష్ఠానానికి ఫిర్యాదు చేయ‌డంతో పాటు జంగా కాంగ్రెస్ ప్రాథ‌మిక స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌నం సృష్టించింది. క్ర‌మ‌శిక్ష‌ణ సంఘం ఎదుట హాజ‌రైన జంగా రాఘ‌వ‌రెడ్డి మౌఖిక వివ‌ర‌ణ ఇచ్చారు. అయితే లిఖిత పూర్వ‌కంగా వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరినా... ఆ త‌ర్వాత విష‌యం స‌ద్దుమ‌ణిగింది. అప్ప‌టి నుంచి జంగా కొంత వెన‌క్కి త‌గ్గినా మ‌ళ్లీ దూకుడు పెంచారు.

టికెట్ ఆశిస్తే త‌ప్పా..!

తాను లోక‌ల్‌.. వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టికెట్ ఆశిస్తే త‌ప్పేంటంటూ జంగా కాంగ్రెస్‌లో విమ‌ర్శ‌కుల‌ను ఎదురు ప్ర‌శ్నిస్తున్నారు. వ‌రంగ‌ల్ ప‌శ్చిమ‌లో త‌నకంటూ స్థిర‌మైన ఓటు బ్యాంకుతో పాటు, అనుచ‌ర‌గ‌ణం ఉంద‌ని వాదిస్తున్నారు. స‌ర్వే చేసినా ఈ విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతుంద‌ని బ‌లంగా చెబుతున్నారు. తాను బ‌ల‌మైన నాయ‌కుడ‌ని ప‌లుమార్లు రుజువైంద‌ని, సొంతంగా కార్పోరేట‌ర్లు గెలిపించిన స‌త్తా త‌న‌ద‌ని గుర్తు చేస్తున్నారు. గెలుపు గుర్రాల‌కే టికెట్లు కేటాయిస్తామ‌ని అధిష్ఠానం చెబుతున్న త‌రుణంలో ప‌శ్చిమ టికెట్ పంచాయితీలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకోబోతోంద‌న్న‌ది ఇప్పుడు కాంగ్రెస్ వ‌ర్గాల్లో ఆస‌క్తిగా మారింది.



Next Story