- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అస్వస్థత.. తల్లిదండ్రుల ఆందోళన
by Aamani |

X
దిశ,గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామంలోని సాంఘిక సంక్షేమ గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు వాంతులు విరేచనాలు కావడం తో గమనించిన గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు వెంటనే గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి విద్యార్థులకు చికిత్స అందించారు. విద్యార్థులు గురువారం సాయంత్రం స్నాక్స్ సమయంలో గుడాలు తీసుకొని రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్ర పోయామని తెల్ల వారు జామున కడుపులో నొప్పి వాంతులు విరోచనాలు అవుతున్నాయని విద్యార్థులు ఉపాధ్యాయులకు తెలుపగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. గురుకుల పాఠశాలలో పర్యవేక్షణ లోపం వల్లనే ఇలా జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
Next Story