- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
భలే మంచి దొంగలు...మనస్సు మార్చుకున్న చోరులు
దిశ, ఖిలా వరంగల్ : దిశ, ఖిలా వరంగల్ : వరంగల్ జిల్లాలో ఓ విచిత్రం జరిగింది. బంగారం చోరీ చేసి తర్జనభర్జన పడి మళ్లీ ఇంట్లో వదిలి వెళ్లారు. ఎత్తుకెళ్లిన బంగారంలో 27 తులాల బంగారు ఆభరణాలను వారం రోజుల తర్వాత తిరిగి అదే ఇంట్లో వేసి వెళ్లిపోయారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఖిలా వరంగల్ మండలం బొల్లికుంటలో గొలికార్ గోపి అతని ముగ్గురు అన్నదమ్ములతో ఉమ్మడి కుటుంబంగా జీవిస్తున్నాడు. వీరి ఇంట్లో వారం రోజుల క్రితం దొంగలు చొరబడి 30 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు.
బాధితులు లబోదిబో మంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ సహాయంతో చోరీ జరిగిన పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వేలిముద్రలను సేకరించి కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. ఇదంతా సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఎలాగైనా తమను పోలీసులు పట్టుకుంటారని భావించిన దుండగులు వారం తర్వాత ఇంటి ప్రహారీ లోపల 27 తులాల బంగారం వదిలి వెళ్లారు. దాంతో బాధితులు ఒకింత ఆశ్చర్యానికి గురి కాగా కారకులు ఎవరనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. వదిలిన బంగారంలో మరో మూడు తులాల బంగారం లేదని గురువారం బాధితులు తెలిపారు.