- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
దేశానికి మార్గ దర్శకుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్

దిశ, గూడూరు: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో బస్టాండ్ సెంటర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే నేడు నాకు జాతీయ ఎస్టీ కమిషన్ వచ్చిందని అన్నారు. దేశంలో మహా మేధావి అంబేద్కర్ అని కొనియాడారు. ఎస్సీ, ఎస్టీలు దళితులు బడుగు బలహీన వర్గాల అందరికీ ప్రజాస్వామ్యంలో సమాన హక్కులు కల్పించిన వారు అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ చంద్రశేఖర్ రావు , విగ్రహ కమిటీ నాయకులు కత్తి స్వామి, డాక్టర్ రవీందర్ రెడ్డి , చల్లా లింగారెడ్డి, రమేష్ నాయక్ , నూనావత్ రాధ , పింగిళి శ్రీనివాస్ , వల్లభు వెంకటేశ్వర్లు, మేరెడ్డి సురేందర్, వాంకుడోత్ కొమ్మలు , మహిపాల్ గ్రామస్తులు పాల్గొన్నారు.