దిశ వార్తకు స్పందన.. విద్యార్థిని మిస్సింగ్‌ను ఛేదించిన పోలీసులు

by Disha Web Desk 7 |
దిశ వార్తకు స్పందన.. విద్యార్థిని మిస్సింగ్‌ను ఛేదించిన పోలీసులు
X

దిశ, బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంధ్రంలో (పీఎమ్‌హెచ్) పోస్టు మెట్రిక్ బాలికల హస్టల్‌లో ఉంటున్న ఇర్ప సమీరా అనే విద్యార్థిని.. బయ్యారం జూనియర్ కళాశాల నందు ఇంటర్మీడియట్ సీఈసీ మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే సమీరా జనవరి 31 న కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి వెళ్లి మరుసటి రోజు ఇంటికి రాకపోవడంతో బాలిక పేరెంట్స్ బయ్యారం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

దీనిపై మిస్సింగ్ కేజు నమోదు చేసుకున్న ఎస్‌ఐ రమాదేవి తమ సిబ్బందితో దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. విద్యార్థిని గుండాలలో తన స్నేహితురాలి ఇంటికి వెళ్లినట్లు ఎస్ఐకి సమాచారం అందడంతో బాలికను అదుపులోకి తీసుకుని తమ సిబ్బంది స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు తెలిపారు. అనంతరం శుక్రవారం సమీరా తల్లి విజయమ్మకు బాలికను అప్పగించారు పోలీసులు. దీంతో ఎస్ఐ రమాదేవిని సిబ్బందికి, మిస్సింగ్ వార్త దిశలో రావడంతో తమ కూతురును తమకు అప్పగించిన వారికి బాలిక పేరెంట్స్, వార్థెన్ విజయలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు.


Next Story

Most Viewed