కాంగ్రెస్ కు షాక్.. గులాబీ గూటికి చేరిన నేతలు

by Disha Web Desk 4 |
కాంగ్రెస్ కు షాక్.. గులాబీ గూటికి చేరిన నేతలు
X

దిశ, నెక్కొండ: నెక్కొండ మండలంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మండలంలోని అప్పల్రావుపేట గ్రామంలో కీలక నేతలు హస్తానికి హాండ్ ఇచ్చి నెక్కొండ మండల పార్టీ అధ్యక్షుడు సంగని సూరయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేష్ యాదవ్, సొసైటీ మాజీ వైస్ చైర్మన్ యాసం.బాలకృష్ణ, గ్రామ పార్టీ అధ్యక్షుడు దామోదర్ ఆధ్వర్యంలో కారెక్కారు. కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీటీసీ అనుచరగణం టీఆర్ఎస్ గూటికి చేరారు. వివరాల్లోకి వెళితే... అప్పల్రావుపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ మచ్చ.వీరన్న, గౌడ్ సంఘం మాజీ అధ్యక్షుడు కొయ్యడ.సారయ్య,విద్య కమిటీ మాజీ చైర్మన్ బానోత్.వెంకన్న,గౌడ సంఘం మాజీ ఉపాధ్యక్షుడు ఊడుగుల.సారయ్య,కొయ్యడ.రామచంద్రు,యూత్ నాయకులు ఊడుగుల.ప్రవీణ్, చెలకలపెళ్లి.యాకయ్య,తిప్పని.సాంబయ్య,ముత్తినేని. వెంకన్న,జిల్లా.వెంకన్న,మద్ది.రవీందర్, ఇటుకాల.కట్టయ్య, మచ్చ.రాజు తదితరులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.


Next Story

Most Viewed