- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
క్షుద్రపూజల కలకలం.. పసుపు, నిమ్మకాయలు, గవ్వలతో..
దిశ, మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం లోని సూరారం గ్రామంలో గురువారం క్షుద్ర పూజలు కలకలం రేపాయి. సూరారం గ్రామానికి చెందిన వడ్లకొండ దుర్గమ్మ, వడ్లకొండ మధు నివసిస్తున్న ఇంటి ముందు పూజలు నిర్వహించినట్టు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు,గవ్వలు ఉండటంతో కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
వడ్లకొండ మధు నక్క తెలిపిన వివరాల ప్రకారం.. తన ఇంటికి సమీపంలో కొంత స్థలాన్ని కొనుగోలు చేయడం జరిగిందని, ఆ స్థలం మాదని కొందరువ్యక్తులు కొంతకాలంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ విషయమై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు కూడా వచ్చి వివరాలు రాసుకొని వెళ్లి పోయారు కానీ శాశ్వత పరిష్కారం చూపడం లేదన్నారు. వడ్లకొండ మధు నక్క కొనుగోలు చేసిన స్థలం మాదే అంటున్న సదరు వ్యక్తులే చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. వారి వల్ల ఆమెకు ప్రాణభయం ఉండటంతో పక్కింటి వారి ఇండ్లలో తలదాచుకున్నట్లు ఆమె తెలిపారు. తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.