- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నక్ష మార్చిండు.. నకిలీ పత్రాలు పుట్టించాడు!
దిశ, వరంగల్ టౌన్: తనది కాని జాగలో ఓ వ్యక్తి అక్రమంగా ఇల్లు నిర్మాణం చేపడుతున్నట్లు సదరు స్థలం బాధితుడు ఆవేదన చెందుతున్నాడు. ఆక్రమణదారుడు అసలు నక్షానే మార్చి దౌర్జన్యానికి దిగుతున్నాడని వాపోయాడు బాధితుడు పైడిపల్లికి చెందిన రాసోజుల సత్యనారాయణ. పైడిపల్లి శివారులో సర్వేనంబర్ 1240 ఐ, 1240 ఎఫ్, 1240 జి`లలో వరుసగా పది గుంటలు, ఆరు గుంటలు, ఐదు గుంటలు మొత్తం 21 గుంటల స్థలాన్ని 1995లోనే కొనుగోలు చేసినట్లు చెప్పాడు.
1240 ఎఫ్, 1240ఐ `లలో 910 చదరపు గజాల స్థలాన్ని (ఇంటినంబర్ 5`322/1) 2007లో తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేయించినట్లు సత్యనారాయణ పేర్కొన్నాడు. ఆ స్థలంలో ఉన్న ఇల్లు తీసేసి 2010లో మరో ఇల్లు కట్టాలనుకున్నట్లు తెలిపాడు. అయితే పరిస్థితుల కారణంగా పనులు చేపట్టడంలో ఆలస్యం చోటుచేసుకోవడంతో నా స్థలంపై జన్ను ఆరోగ్యం అనే వ్యక్తి కన్నుపడిందని కన్నీటి పర్యంతమయ్యాడు.
నా జాగను ఆక్రమించుకోవడమే కాకుండా 2012లో కేసు కూడా వేశాడని సత్యనారాయణ రోదిస్తూ చెప్పాడు. అయితే, ఆరోగ్యంకు 1240/7లో కొంత స్థలం ఉందని, ఆ జాగ నక్ష ప్రకారం నా స్థలానికి వెనుక భాగంలో చాలా దూరంలో ఉంటుందని సత్యనారాయణ పేర్కొన్నారు. ఆ నక్షాను ఏమార్చి నా స్థలం చూపించి, నకిలీ పత్రాలతో ఆక్రమించుకున్నాడని సత్యనారాయణ ఆవేదన వెళ్లగక్కాడు.
తాజాగా, నా స్థలంలో ఆరోగ్యం ఇల్లు కడుతున్నాడని, ఆ జాగపై కోర్టులో కేసు నడుస్తున్న.. అక్రమంగా, అన్యాయంగా ఆక్రమించుకున్నాడని, తన భూమిని రక్షించి న్యాయం చేయాలంటూ వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారులను, స్థానిక పోలీసులను, రెవెన్యూ అధికారులను సత్యనారాయణ వేడుకుంటున్నాడు. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి తనను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.