- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
చెల్లెలిపై కన్నెసిన కామాంధుడు.. ఆరు నెలలుగా..
దిశ, కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో సొంత చిన్నాన కూతురిని 6 నెలలుగా బెదిరించుకుంటు ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కన్నాయిగూడెం మండలం గుర్రేవుల గ్రామ పంచాయితి పరిదిలో వాసం పల్లి చంటి (28) అనే యువకుడి పెళ్లి అయి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వావి వరుసలు మరిచిన చంటి తన సొంత చిన్నాన కూతురు వరుసకు చెల్లెలు పై కన్నెశాడు. పుష్పాలంకరణ శుభకార్యం రోజు నుండే మైనర్ బాలిక అయిన చెల్లెలిని తన కామవాంచ తీర్చమని వేదింపులకు పాల్పడ్డాడు. తను చేసేది తప్పు అని నేను నీకు చెల్లెలిని అవుతాను అని చెప్పిన వినకుండా కామాంధుడు చంటి లైంగికంగా వేధించే వాడని ఆ బాలిక తెలిపింది. అయితే ఈ విషయం ఎవరికైన చెపితే తనను, బాలిక కుటుంబాన్ని చంపేస్తానని బెదిరిస్తూ.. 6 నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక కన్నీరుమున్నీరైయింది.
గత మూడు రోజుల క్రితం అ బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లీ, తండ్రులు అ బాలికకు వైద్య పరీక్షలు చేయించగా గర్బం దాల్చిందని తేలింది. బాలికను నిలదీసిన తల్లీ దండ్రులకు అ బాలిక భయపడుతూ.. విషయం చెప్పేసింది. విషయం తెలుసుకున్న తల్లీ దండ్రులు కుల పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టించాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కామాంధుడు చంటి పారిపోయాడు.
తల్లీ, తండ్రుల అవేదన..
అభం శుభం తెలియని తన కూతురిని బెదిరించి 6 నెలలుగా అత్యాచారానికి పాల్పడుతు.. తన కూతురిని శారీరకంగా, మానసికంగా హింసిస్తూ అత్యాచారానికి పాల్పడ్డా అ మానవ మృగం చంటికి చట్ట పరంగా కఠిన శిక్ష పడేలా చేయాలని బాలిక తల్లీ అవేదన వ్యక్తం చేసింది. పరారీలో ఉన్న కామాంధుడు చంటిపై పోలిసులు ఫోక్స్ చట్టం, 376 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.