అమెరికాలో వారం రోజులుగా మరో తెలంగాణ విద్యార్థి మిస్సింగ్...

by Disha Web Desk 11 |
అమెరికాలో వారం రోజులుగా మరో తెలంగాణ విద్యార్థి మిస్సింగ్...
X

దిశ, హనుమకొండ టౌన్ : అమెరికాలో వారం రోజులుగా మరో తెలంగాణ విద్యార్థి మిస్సింగ్ అయినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని హన్మకొండ కు చెందిన రూపేష్ చంద్ర చికాగోలో ప్రస్తుతం విస్కాన్సిన్​లోని కంకార్డియా యూనివర్సిటీ లో మాస్టర్స్​ చదువుతున్నాడు. ఇతడు మే 2 నుంచి అదృశ్యమయ్యాడు.అయితే చివరిగా మే 2న మధ్యాహ్నం కొడుకుతో వాట్సప్ కాల్ మాట్లాడిన అనంతరం అతని ఫోన్ స్విచ్ఛాఫ్ లోకి వెళ్లిపోయిందని తండ్రి తెలిపాడు. కుటుంబ సభ్యులు అతని రూమ్మేట్స్‌తో మాట్లాడగా, ఎవర్నో కలవడానికి వెళ్లాడని వారు ఎవరో తమకు తెలియదని బదులిచ్చారు. రూపేష్​ చంద్ర అదృశ్యమైనట్లు చికాగో పోలీసులకు సమాచారం అందించారు తల్లిదండ్రులు. అలాగే అమెరికా ఎంబసీని కూడా సంప్రదించినట్లు వెల్లడించారు.

Next Story

Most Viewed