మంటలు అంటుకుని వృద్ధుడి దుర్మరణం

by Dishaweb |
మంటలు అంటుకుని వృద్ధుడి దుర్మరణం
X

దిశ,రఘునాథపల్లి: కంచను చదును చేసి చెత్తాచెదారాన్ని కాలబెడుతుండగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని ఓ వృద్ధుడు దుర్మరణం చెందిన ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని రామన్నగూడెం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మామిండ్ల యాదగిరి (65) గ్రామంలో వేరే రైతుకు చెందిన పొలాన్ని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. కంచలోని చెత్తాచెదారాన్ని తొలగించి దాన్ని కాల్చేందుకు నిప్పు అంటించాడు.

మంటను తీవ్రంగా వ్యాపించి పక్కనే ఉన్న గడ్డి వాము వైపు వెళుతుండగా వాటిని ఆర్పే ప్రయత్నంలో పరుగు తీశాడు. చెట్టుకొమ్మలు తగిలి కింద పడిపోయి లేచే సమయానికి తన చుట్టూ మంటలు వ్యాపించి ఆయన ఒంటికి అంటుకున్నాయి. దీంతో మంటల్లో ఖాళీ మృత్యువాత పడ్డాడు. ఆయన అరుపులు కేకలు వేసిన ప్రయోజనం లేకపోయింది. జనగామ రూరల్ సీఐ ఆర్. సంతోష్, ఎస్సై సిహెచ్ రఘుపతి లు సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.


Next Story

Most Viewed