బైక్ ఎక్కిస్తుండగా ట్రైన్ వెళ్లిపోయింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..? (వీడియో)

by Dishafeatures2 |
బైక్ ఎక్కిస్తుండగా ట్రైన్ వెళ్లిపోయింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..? (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: కొందరు యువకులు బైక్ ను పార్సిల్ చేసేందుకు ట్రైన్ లోకి ఎక్కిస్తున్నారు. అయితే బైక్ ను పూర్తిగా ట్రైన్ లోపలికి ఎక్కించకముందే ట్రైన్ కదిలింది. అనంతరం ట్రైన్ స్లో గా పరుగులు పెడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో బైక్ ను ట్రైన్ లోకి ఎక్కిస్తున్న యువకులు షాక్ తిన్నారు. సగం బైక్ బయటే ఉండటంతో విద్యుత్ స్తంభాలకు తగిలితే బైక్ డ్యామేజ్ అవుతుందోనని వారంతా టెన్షన్ పడ్డారు. కానీ ట్రైన్ కొంత దూరం వెళ్లాక ట్రైన్ లో ఉన్న యువకులు ఆ బైక్ ను లోపలికి లాగారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన వరంగల్ రైల్వే స్టేషన్ లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో AISF పెద్దపల్లి జిల్లా నాయకుడు ఈదునూరి ప్రేమ్ ఉన్నారు.




Next Story