- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మేడారం జాతరకు వచ్చినట్టే, KCR సభకు రాబోతున్నారు : వినయ్ భాస్కర్

దిశ, వెబ్ డెస్క్: కేసీఆర్ సభ పై ( kcr ) మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ( Vinay Bhaskar) కీలక ప్రకటన చేస్తున్నారు. మేడారం జాతరకు (medaram) ఎలా తరలి వెళ్తారో మా సభకు కూడా జనాలు అలానే వస్తారని పేర్కొన్నారు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. 25 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ ( BRS) పండుగకు ఊరు, వాడ, పల్లె, పట్టణం కదులుతుందని తెలిపారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ( BRS Silver Jubilee Celebration) ప్రజలు స్వచ్ఛందంగా సంతోషంతో వస్తారన్నారు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్.
అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి దాకా అందరికీ సంక్షేమాన్ని అందించిన పార్టీ బీఆర్ఎస్ అని కొనియాడారు. లగచర్ల, HCU అంశాల్లో బీఆర్ఎస్ పార్టీ బాధితుల పక్షాన పోరాటం చేసిందన్నారు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. అధికారం ఉన్నా లేకపోయినా మేము ఎప్పుడూ ప్రజల పక్షమే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు విసిగి పోయారన్నారు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. తెలంగాణాలో మరోసారి తమ సర్కార్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉండగా ఈ నెల 27 వ తేదీన అంటే ఆదివారం బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరుగనుంది.