- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
‘మిషన్భగీరథ’ పేర బ్యాంకును మోసం చేసిన ఇద్దరు అరెస్ట్
![‘మిషన్భగీరథ’ పేర బ్యాంకును మోసం చేసిన ఇద్దరు అరెస్ట్ ‘మిషన్భగీరథ’ పేర బ్యాంకును మోసం చేసిన ఇద్దరు అరెస్ట్](https://www.dishadaily.com/h-upload/2024/03/02/313100-cheating.webp)
దిశ తెలంగాణ క్రైం బ్యూరో: మిషన్భగీరథ ప్రాజెక్ట్పనుల కోసమంటూ బ్యాంకు నుంచి కోటీ 30 లక్షల రూపాయల రుణం తీసుకుని ఎగ్గొట్టిన వ్యక్తిని సైబరాబాద్ఎకనామిక్అఫెన్సెస్వింగ్అధికారులు అరెస్ట్చేశారు. అతనికి సహకరించిన బ్యాంక్మాజీ ఛీఫ్మేనేజర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుని కోసం గాలిస్తున్నారు. ఎకనామిక్అఫెన్సెస్వింగ్డీసీపీ కే.ప్రసాద్తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రామాంతాపూర్నివాసి మహ్మద్ఫయాజ్అహమద్, మహ్మద్చాంద్పాషాలు ఏఎఫ్ఎస్కన్స్ర్టక్షన్స్కంపెనీ ప్రైవేట్లిమిటెడ్కంపెనీ డైరెక్టర్లు. ఇదిలా ఉండగా ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలో ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇచ్చే కాంట్రాక్ట్పొందిన ఈ ఇద్దరు పనులు ప్రారంభించారు కూడా.
అయితే, ఈ పనులను అడ్డం పెట్టుకుని బ్యాంకు నుంచి భారీ మొత్తంలో రుణం తీసుకుని ఎగ్గొట్టాలని పథకం వేసుకున్న ఈ ఇద్దరు కెనరా బ్యాంక్బాలానగర్బ్రాంచుకు అప్పట్లో ఛీఫ్మేనేజర్గా ఉన జీ.శ్రీనివాస్బాబును కలిశారు. తమకు సహకరించి రుణం మంజూరు చేస్తే భారీ మొత్తంలో కమీషన్ఇస్తామన్నారు. దీనికి శ్రీనివాస్బాబు అంగీకరించాడు. ఈ క్రమంలో మహ్మద్ఫయాజ్అహమద్, మహ్మద్చాంద్పాషాలు ఫోర్జరీ డాక్యుమెంట్లను సమర్పించి బ్యాంకు నుంచి కోట 30లక్షల రూపాయల రుణం తీసుకున్నారు. ఆ తరువాత రుణాన్ని తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టారు. ఈ మేరకు బ్యాంక్అధికారుల నుంచి ఫిర్యాదు అందగా సైబరాబాద్కమిషనరేట్ఎకనామిక్అఫెన్సెస్వింగ్ఏసీపీ ఎం.హుస్సేనీ నాయుడు ఐపీసీ 406, 409, 420, 467, 468, 471 రెడ్విత్120బీ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. కేసులో నిందితులుగా ఉన్న మహ్మద్ఫయాజ్అహమద్, శ్రీనివాస్బాబును అరెస్ట్చేశారు. పరారీలో ఉన్న మహ్మద్చాంద్పాషా కోసం గాలిస్తున్నారు.