మునుగోడులో TRS బంపర్ విక్టరీ.. కూసుకుంట్లకు భారీ మెజార్జీ!

by GSrikanth |   ( Updated:2022-11-06 11:51:00.0  )
మునుగోడులో TRS బంపర్ విక్టరీ.. కూసుకుంట్లకు భారీ మెజార్జీ!
X

దిశ, వెబ్‌డెస్క్: మునుగోడులో అధికార టీఆర్ఎస్ పార్టీ గెలుపు దాదాపు ఖరారైంది. పద్నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పదివేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇంకా ఒక రౌండ్‌ కౌంటింగ్ మిగిలి ఉన్నప్పటికీ కూసుకుంట్ల గెలుపు ఖరారైంది. 5వ రౌండ్‌లో సగానికిపైగా రాజగోపాల్ రెడ్డి ఓట్లు సాధించినా ఫలితం లేకపోవడంతో అధికార పార్టీ అభ్యర్థికి గెలుపు సునాయాసం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 15 రౌండ్లు పూర్తయిన అనంతరం గెలిచిన అభ్యర్థిని ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు.

కాగా, మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ సీన్ రివర్స్ అయింది. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి వ్యూహాలు బెడిసికొట్టాయి. ఓవర్ కాన్ఫిడెన్స్‌తో పాటు ఆయన వ్యూహాలు అనుకున్న స్థాయిలో ఓట్లు రాల్చడంలో విఫలమయ్యాయి. అభ్యర్థికి, పార్టీకి మధ్య కోఆర్డినేషన్ లోపించడం కూడా ప్రధాన కారణంగా తెలుస్తోంది. అంతేకాకుండా రాజగోపాల్ రెడ్డి సొంత కేడర్, స్థానిక బీజేపీ నేతలకు మధ్య కూడా సమన్వయ లోపం ఏర్పడినట్లుగా టాక్. మునుగోడు ఉప ఎన్నికల కోసం బీజేపీ ఏర్పాటుచేసిన జంబో స్టీరింగ్ కమిటీ వ్యూహ రచనలో ఫ్లాప్ అయింది. చౌటుప్పల్, చండూరు మీద రాజగోపాల్ రెడ్డి పెట్టుకున్న ఆశలు నిరాశను మిగిల్చింది.

Read more :

1. మునుగోడు రిజల్ట్.. కోమటిరెడ్డి దారెటు?



Next Story

Most Viewed