బీఆర్ఎస్ తీర్మానంతో ఢిల్లీకి టీఆర్ఎస్ బృందం

by Disha Web Desk |
బీఆర్ఎస్ తీర్మానంతో ఢిల్లీకి టీఆర్ఎస్ బృందం
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మారుస్తూ బుధవారం పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. ఆ తీర్మానం కాపీలను తీసుకొని టీఆర్ఎస్ బృందం సాయంత్రమే ఢిల్లీ వెళ్లింది. ఈ బృందంలో ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. గురువారం ఉదయం 11 గంటలకు కేంద్ర ఎన్నికలసంఘంతో భేటీ కానున్నారు. తీర్మానానికి సంబంధించిన పత్రాలను, అఫిడవిట్ ను అందజేయనున్నారు. ఇప్పటికే పలుమార్లు ఈసీ అధికారులతో చర్చించి సలహాలు తీసుకున్న పార్టీ నేతలు, ఆ నిబంధనల ప్రకారమే అఫిడవిట్ తో పాటు తీర్మాన కాపీని సిద్ధం చేశారు. అయితే వీటిని ఎన్నికల సంఘం అందజేయనుండటంతో ఎన్ని రోజుల్లో ఆమోదిస్తుందనే దానిపై మాత్రం సస్పె్న్స్. కాలపరిమితి సైతం లేదని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు



Next Story