- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మునుగోడులో టీఆర్ఎస్కు భారీ షాక్.. ఈటల సమక్షంలో బీజేపీలో చేరిన సర్పంచులు
దిశ, చండూరు: ఉపఎన్నికల వేళ మునుగోడులో టీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరికలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మండల పరిధిలో ఐదుగురు సర్పంచులు, అలాగే మునుగోడు మండలం చల్మెడ సర్పంచ్ టీఆర్ఎస్ పార్టీని వీడి.. ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునుగోడు అభివృద్ధి చెందాలన్నా.. గ్రామాలు అభివృద్ధి పదంలో నడవాలన్నా అది బీజేపీ తోనే సాధ్యమని, పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తామని వారు తెలిపారు.
బీజేపీలో చేరిన వారిలో నేర్మట గ్రామ సర్పంచ్ నందికుంట నరసింహారెడ్డి, ధోని పాముల సర్పంచ్ తిప్పర్తి దేవేందర్, చొప్పరి వారి గూడెం సర్పంచ్ అనురాధ వెంకన్న, తుమ్మలపల్లి టీఆర్ఎస్ సర్పంచ్ కూరపాటి రాములమ్మ, సైదులు, ఉన్నారు. అలాగే కాస్తాల గ్రామ సర్పంచ్ మెండు ద్రౌపదీ వెంకట్ రెడ్డి, మునుగోడు మండలం నుండి, చల్మెడ గ్రామ సర్పంచ్ కర్నాటి ఉషయ్య కూడా బీజేపీలో చేరారు. త్వరలో వివిధ గ్రామాల సర్పంచులు, మరికొంతమంది కాంగ్రెస్ సర్పంచులు, ఎంపీటీసీలు బీజేపీ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పల్లె వెంకన్న, దోటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.