- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
'మునుగోడు టీఆర్ఎస్ సీటు కాకున్నా గెలిచి చూపించాం'

దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడు ప్రజల తీర్పు బీఆర్ఎస్ బలోపేతానికి బాటలు వేసిందని ఎంపీలు స్పష్టం చేశారు. బీఆర్ఎస్కు దేశమంతా ఆదరణ లభిస్తోందన్నారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ ఎంపీలు వెంకటేష్ నేత, మాలోతు కవిత, మన్నె శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. మునుగోడు ఓటర్లు టీఆర్ఎస్కు, కేసీఆర్కు, తెలంగాణకు అండగా నిలిచారన్నారు. ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్ న్యాయం కోసం యుద్ధం చేసిందని, మోడీ కార్పొరేట్ ఎత్తుగడలను మునుగోడు ఓటర్లు చిత్తు చేశారన్నారు. బీఆర్ఎస్ ను అడ్డుకునేందుకు మోడీ, అమిత్ షాలు మునుగోడు ఉపఎన్నిక తెచ్చారని ఆరోపించారు. బీజేపీ ఓ డ్రామా కంపెనీలా మారిందని ఆరోపించారు. రాజ్యాంగ బద్ధంగానే ఇతర పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరారని, ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తీసుకోలేదన్నారు. బీజేపీయే పలు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాలను మార్చిందని మండిపడ్డారు. కార్పొరేట్ రాజకీయాలకు బీజేపీ నేత వివేక్ తెర లేపారని, ఆయనకు కేటీఆర్ను విమర్శించే స్థాయిలేదన్నారు. బీజేపీ నేతలు అబద్దాలు మాట్లాడటం తగ్గించుకోవాలని సూచించారు. మునుగోడు టీఆర్ఎస్ సీటు కాకున్నా గెలిచి చూపించామని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ భానుప్రసాద్ మాట్లాడుతూ మునుగోడులో టీఆర్ఎస్ ఓట్ల శాతం గణనీయంగా పెరిగిందన్నారు. కారును పోలిన గుర్తులు లేక పోతే టీఆర్ఎస్ మెజారిటీ ఇంకా పెరిగేదన్నారు. తెలంగాణ అభివృద్ధికి పనికొచ్చే పనులను బీజేపీ చెస్తే మంచిదని సూచించారు.