- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తెలంగాణలో ఐఏఎస్ల బదిలీలు.. ఎవరు ఎక్కడికంటే?
దిశ, వెబ్డెస్క్ : తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులు, డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ అండ్ ఐజీగా రాహుల్ బొజ్జ, డ్రగ్ కంట్రోల్ బోర్డు డైరెక్టర్గా రిజ్వీ, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ శాఖ కార్యదర్శిగా బుద్ధ ప్రకాష్, విద్యా శాఖ కార్యదర్శిగా వాకాటి కరుణ, జి.ఎ.డి కార్యదర్శిగా శేషాద్రి, టూరిజం, యువజన విభాగం కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియాకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. పలువురు డీఎస్పీలు సైతం బదిలీ అయ్యారు. నిర్మల్ డీఎస్పీగా ఎల్.జీవన్ రెడ్డి, అచ్చంపేట్ డిఎస్పీగా కే.కృష్ణ కిషోర్, వేములవాడ డీఎస్పీగా కే.నాగేంద్ర చారి, హనుమకొండ (వరంగల్) ట్రాఫిక్ ఏసీపీగా ఏ.మధుసూదన్, కామారెడ్డి (ఆర్) ఎల్లారెడ్డి డీఎస్పీగా ఏ.శ్రీనివాసులు, ఎల్బీనగర్ ఏసీపీగా సి.అంజయ్య, నాగర్ కర్నూల్ డీఎస్పీగా బి.మోహన్ కుమార్ లను నియమించింది.