మంత్రులకు షాకిచ్చిన మునుగోడు ఫలితం.. ఫెయిల్ అయిన మినిస్టర్స్ వీళ్లే..!

by Nagaya |
మంత్రులకు షాకిచ్చిన మునుగోడు ఫలితం.. ఫెయిల్ అయిన మినిస్టర్స్ వీళ్లే..!
X

దిశ, మర్రిగూడ: బైపోల్‌లో టీఆర్ఎస్ విజయం సాధించినా, మెజార్టీ మంత్రులు 'ఫెయిల్' అయ్యారు. ఇన్ చార్జిగా గ్రామంలో ఓట్లు రాబట్టుకోవడంలో వెనకబట్టారు. 16 మంది మంత్రులు వివిధ గ్రామాలకు యూనిట్ ఇన్ చార్జిలుగా వ్యవహరించారు. మంత్రి మల్లారెడ్డి బాధ్యతలు నిర్వర్తించిన ఆరెగూడెం, మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇన్ చార్జిగా వ్యవహరించిన లింగోజిగూడెంలలో టీఆర్ఎస్ కంటే బీజేపీకే అధికంగా ఓట్లు వచ్చాయి. మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇన్ చార్జిగా ఉన్న దేవులమ్మ నాగారంలో కూడా బీజేపీయే ఆధిక్యత కనబర్చింది. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి లు ఇన్ చార్జిలుగా ఉన్న గ్రామాల్లో సైతం బీజేపీ అధికంగా ఓట్లు సాధించగలిగింది. ఇదిలా ఉండగా సీఎం ఇన్ చార్జిగా ఉన్న లెంకలపల్లిలో టీఆర్ఎస్ 254 ఓట్ల ఆధిక్యం సాధించగలిగింది. మంత్రి హరీశ్ రావు ఇన్ చార్జి గా ఉన్న మర్రిగూడలో టీఆర్ఎస్ 542 ఓట్లతో ఆధిక్యం కనబర్చింది.



Next Story