దసరా రోజున సమావేశం జరిగి తీరుతుంది: కేసీఆర్

by Disha Web Desk 19 |
దసరా రోజున సమావేశం జరిగి తీరుతుంది: కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ భవన్‌లో దసరా నాడు (అక్టోబర్ 05) ఉదయం 11 గంటలకు తలపెట్టిన టీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ మీటింగ్ యధావిధిగా జరగుతుందని టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో దాని ప్రభావం, దసరా నాటి టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం పైన ఉండదని.. సభ్యులు అనుమానాలకు గురికావద్దని అన్నారు. ముందుగా ప్రకటించినట్టే అక్టోబర్ 5వ తేదీన ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో పార్టీ సర్వసభ్య సమావేశం కొనసాగుతుందని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. అందరూ నిర్దేషిత సమయంలోపే హాజరుకావాలని సూచించారు.


Next Story

Most Viewed