- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
గవర్నర్ అపాయింట్మెంట్ కోరాం.. ఇంకా ఖరారు కాలేదు

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ యూనివర్శిటీల కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు 2022 బిల్లుపై గవర్నర్తో చర్చించడానికి వెళ్లేందుకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సహా విద్యాశాఖ అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు బుధవారం మీడియాతో చిట్చాట్ నిర్వహించిన విద్యాశాఖ మంత్రి సబితా ప్రభుత్వానికి గవర్నర్ లేఖ వచ్చిందని అన్నారు. గవర్నర్ని కలవమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో గవర్నర్ అపాయింట్మెంట్ కోరాం ఇంకా ఖరారు కాలేదని విద్యాశాఖ మంత్రి అన్నారు. గవర్నర్కు ఉన్న సందేహాలు తెలియదు కాబట్టి ఇప్పుడే స్పందించలేను. గవర్నర్ని కలిసి ఆమె సందేహాలు నివృత్తి చేస్తాం అని సబిత అన్నారు. గవర్నర్ సమయం ఇవ్వగానే కలుస్తానంటూ మంత్రి సబితా స్పష్టం చేశారు. కాగా, ఇవాళ సాయంత్రం గవర్నర్ తమిళిసై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, అదే గవర్నర్ అపాయింట్మెంట్ ఇస్తే తాము గవర్నర్ను కలిసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం సంకేతాలు పంపింది.
#BREAKING News
— Sagar KV (@SagarVanaparthi) November 9, 2022
గవర్నర్ లేఖపై స్పందించిన విద్యాశాఖ మంత్రి .@SabithaindraTRS
ప్రభుత్వానికి గవర్నర్ నుంచి లేఖ వచ్చింది
గవర్నర్ ను కలవమని నన్ను ప్రభుత్వం ఆదేశించింది
గవర్నర్ ను కలిసి సందేహాలు నివృత్తి చేస్తాం
ఇంకా సమయం ఇవ్వలేదు... సమయం ఇవ్వగానే ఆమెను కలుస్తా pic.twitter.com/LU8yTGkvkX