రాజ్ భవన్‌తో వైరం ముగిసినట్లేనా.. వ్యూహాత్మకంగానే సర్కార్ సైలెంట్..?

by Disha Web Desk 19 |
రాజ్ భవన్‌తో వైరం ముగిసినట్లేనా.. వ్యూహాత్మకంగానే సర్కార్ సైలెంట్..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రెండేండ్ల గ్యాప్ తర్వాత గవర్నర్ అసెంబ్లీకి వచ్చారు. ఉభయసభలనుద్దేశించి ప్రసంగించారు. బడ్జెట్ సమావేశాల కారణంగా గవర్నమెంట్‌కు, ‌గవర్నర్‌కు మధ్య రిలేషన్స్ మెరుగుపడ్డాయి. అయితే ఇది ఇప్పటివరకేనా.. లేక కంటిన్యూ అవుతాయా అనే ఆసక్తికర చర్చలు రాజకీయవర్గాల్లో జరుగుతున్నాయి. అయితే పరిస్థితులను బట్టి మారవచ్చని మంత్రులు అభిప్రాయపడుతున్నారు. తమ వైపు నుంచి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ఇచ్చామని, ఇకపైన కూడా ఇదే కంటిన్యూ అవుతుందని, అయితే ఆమెవైపు నుంచి ఎలా ఉంటాయన్నది కాలమే తేలుస్తుందన్నారు.

ఘన స్వాగతం..

బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించడానికి వచ్చిన గవర్నర్‌కు సీఎం సహా స్పీకర్, కౌన్సిల్ చైర్మన్, అసెంబ్లీ సెక్రటరీ తదితరులంతా రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలే ప్రసంగంలో ఉండడంతో గవర్నర్ స్పీడ్‌‌గా చదివేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశంసించడమో లేక విమర్శించడమో లేకపోవడంతో ఆమె స్పందన బహిర్గతం కాలేదు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆమెకు అవకాశం ఇవ్వాల్సి రావడంతో ఎక్కడా కొరత రాకుండా చూసుకున్న ప్రభుత్వం ఇప్పటికైతే ఆమెను నొప్పించకుండా చూసుకున్నది. దీంతో ఆమె సంతృప్తి చెందారా? భవిష్యత్తులో పరస్పర సహకారానికి ఈ సెషన్ దోహదపడుతుందా? అనేదానిపై మాత్రం అధికార పార్టీ నేతల్లో క్లారిటీ లేదు.

కంటిన్యూ చేస్తేనే బెటర్..

గవర్నర్‌తో రిలేషన్స్‌ను ప్రభుత్వం కంటిన్యూ చేస్తేనే బాగుంటుందనే అభిప్రాయం అధికార పార్టీ నేతల్లో వ్యక్తమైంది. గవర్నర్ అసెంబ్లీకి రావడానికి ముందు యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి టెంపుల్‌‌కు వెళ్లారు. అక్కడ ప్రొటోకాల్ ప్రకారం కలెక్టర్, డీసీపీలు స్వాగతం పలికారు. ప్రభుత్వం వైపు నుంచి అన్నీ పాజిటివ్‌గానే ఉంటాయని, ఇకపై మార్పు రావాల్సిందిగా రాజ్‌భవన్ వైపు నుంచే అని రూలింగ్ పార్టీ నేతలు చెబుతున్నారు. గవర్నర్ వ్యవహారశైలిపైనే ప్రభుత్వ వైఖరి ఖరారవుతుందని పేర్కొంటున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో రిస్క్ వద్దనే కోణం నుంచి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నది. గవర్నర్‌తో ఘర్షణను నివారించుకోవాలనుకుంటున్నది. ఇకపైన ఎలాంటి రిలేషన్స్ ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.


Next Story

Most Viewed