ప్రశాంతంగా ముగిసిన ఫుడ్​ సేఫ్టీ ఆఫీసర్స్​ ఎగ్జామ్‌

by Vinod kumar |
ప్రశాంతంగా ముగిసిన ఫుడ్​ సేఫ్టీ ఆఫీసర్స్​ ఎగ్జామ్‌
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో 24 ఫుడ్​సేఫ్టీ ఆఫీసర్స్​ భర్తీ కోసం టీఎస్పీఎస్సీ సోమవారం రాత పరీక్ష నిర్వహించింది. ఉదయం, మధ్యాహ్నం రెండు పేపర్లతో ఈ పరీక్షను నిర్వహించారు. ఉదయం సెషన్​ లో 57.92 శాతం అభ్యర్థులు హాజరుకాగా, మధ్యాహ్నం సెషన్‌లో 58.21 శాతం హాజరు నమోదైంది. పేపర్–1 తెలుగు, ఇంగ్లీష్​ భాషల్లో, పేపర్–2 ఇంగ్లీష్​భాషలో నిర్వహించారు. ఈ పోస్టుల కోసం మొత్తం 16,381 మంది అభ్యర్థులు అప్లై చేసుకోగా.. 14,830 మంది హాల్​ టికెట్లను డౌన్​ లోడ్​చేసుకున్నారు. మార్నింగ్​సెషన్‌లో 9488 మంది, మధ్యాహ్నం సెషన్‌లో 9535 మంది అభ్యర్థులు రాత పరీక్షకు హాజరయ్యారు. ఈ పోస్టులు రాత పరీక్ష ఆధారంగానే ఎంపిక చేయనున్నారు.



Next Story

Most Viewed