KCR: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశం.. ముహూర్తం ఖరారు

by Gantepaka Srikanth |
KCR: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశం.. ముహూర్తం ఖరారు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజకీయాల్లో గులాబీ బాస్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) యాక్టీవ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 8వ తేదీన బీఆర్ఎస్(BRS) పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఎర్రవెల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్(KTR) తెలియజేశారు. తాజా రాజకీయాలు, హరీష్ రావు, కౌశిక్ రెడ్డి అరెస్టుకు సంబంధించిన విషయాలు, పట్నం నరేందర్ రెడ్డి వ్యవహారం గురించి కీలకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అంశాలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed