కాసేపట్లో 'మునుగోడు' కౌంటింగ్.. తొలి ఫలితం వచ్చేదప్పుడే?

by GSrikanth |
కాసేపట్లో మునుగోడు కౌంటింగ్.. తొలి ఫలితం వచ్చేదప్పుడే?
X

దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు ఇవాళ(06-11-2022) వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 21 టేబుల్స్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. 15 రౌండ్లలో పోలింగ్ పూర్తి కానుంది. మొదటి రౌండ్ ఫలితం ఉదయం 9 గంటలకు వెలువడనుంది. చివరి రౌండ్ ఫలితం ఒంటిగంట సమయానికి వెలువడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 250 మందిని నియమించారు. ఒక్కో టేబుల్‌కు కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్, మైక్రో అబ్జర్వర్‌లను నియమించారు. మొదటగా చౌటుప్పల్ మండల ఓట్లు తర్వాత నారాయణ పురం, మునుగోడు, చండూరు, మర్రిగూడ, నాంపల్లి, గట్టుప్పల్‌ మండలాల ఓట్లు వరుసగా లెక్కించనున్నారు.

కాగా, రాజకీయ వర్గాల్లో అత్యంత ఉత్కంఠ రేపిన మునుగోడు ఉపఎన్నిక ప్రచారం హోరాహోరీగా సాగింది. చివరి వరకూ పోరాడిన ప్రధాన పార్టీల అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఈ ఎన్నికలో విజయంపై టీఆర్ఎస్, బీజేపీ విశ్వాసం వ్యక్తం చేస్తుండగా.. అనూహ్య ఫలితాలు వస్తాయని కాంగ్రెస్‌ ఆశిస్తోంది.



Next Story