టెన్త్ క్లాస్ పరీక్షా పేపర్ లీక్‌‌.. చర్యలు తీసుకున్న కలెక్టర్

by Dishanational1 |
టెన్త్ క్లాస్ పరీక్షా పేపర్ లీక్‌‌.. చర్యలు తీసుకున్న కలెక్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: నంద్యాల టెన్త్ క్లాస్ పరీక్షా పేపర్ లీక్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సీఆర్పీతోపాటు 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొలిమిగుంట్ల మండలం అంకిరెడ్డిపల్లిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. దీనిపై స్థానిక కలెక్టర్ స్పందిస్తూ.. పరీక్షా పేపర్ లీక్ చేసిన 12 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత క్వశ్చన్ పేపర్‌ను సీఆర్పీ రాజేష్ మొబైల్‌‌లో ఫొటో తీసి 9 మంది టీచర్లకు పంపాడు. దీంతో సీఆర్పీ రాజేష్‌‌తోపాటు మిగిలిన వాళ్లని కూడా అరెస్టు చేశామని కలెక్టర్ స్పష్టం చేశారు. అంతేగాకుండా చీఫ్ సూపరిండెంట్, ఇన్విజిలేటర్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్, ఫ్లయింగ్ స్క్వాడ్‌‌ను సస్ప్ండ్ చేసినట్లు కలెక్టర్ చెప్పారు.


Next Story

Most Viewed