భారత్ -పాక్ మధ్య ఉద్రిక్తతలు.. శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కలకలం

by Ramesh Goud |   ( Updated:2025-05-09 13:41:41.0  )
భారత్ -పాక్ మధ్య ఉద్రిక్తతలు.. శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కలకలం
X

దిశ, వెబ్ డెస్క్: భారత్ -పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయానికి (Shamshabad Airport) బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. దీంతో ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది (Security Staff) అప్రమత్తం అయ్యారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sinddor) చేపట్టిన తర్వాత ఇండియా- పాకిస్థాన్ బార్డర్ (India -Pak Border) లో యుద్ద వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే పాకిస్థాన్ నుంచి ఇండియాకు బెదిరింపు మెయిల్స్ (Threatening Mails), కాల్స్ రావడం మొదలయ్యాయి.

భారతదేశంలో ఉన్న స్టేడియాలను, విమానాశ్రయాలను బాంబు పెట్టి పేల్చేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయానికి ఇలాంటి బెదిరింపు మెయిల్ వచ్చింది. ఎయిర్ పోర్టును ఏ క్షణమైనా బాంబుతో పేల్చేస్తామని హెచ్చరిస్తూ పాకిస్థాన్ స్లీపర్ సెల్స్ పేరుతో మెయిల్ పెట్టారు. దీంతో అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది విమానాశ్రయం మొత్తం విస్తృత తనిఖీలు చేపట్టారు. డాగ్ స్క్వాడ్ (Dog Squads) ను పిలిపించి ఎయిర్ పోర్టులో సోదాలు నిర్వహించారు. అంతేగాక మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై ఆరా తీస్తున్నారు.



Next Story

Most Viewed