విద్యుత్ సౌధ ఎదుట ఉద్రిక్తత

by Disha Web Desk 16 |
విద్యుత్ సౌధ ఎదుట ఉద్రిక్తత
X

దిశ, తెలంగాణ బ్యూరో : విద్యుత్ సౌధ ఎదుట తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యుత్ శాఖలో రోస్టర్ విధానాన్ని తొలగించడంపై ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈమేరకు శుక్రవారం విద్యుత్ సౌధ ఎదుట రాష్ట్ర విద్యుత్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం(621/14) ఉద్యోగులు నిరసనకు దిగారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రోస్టర్ విధానం లేకుంటే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని నినాదాలు చేశారు. సంస్థ కోసం తీవ్రంగా శ్రమించేది తామేనని వారు పేర్కొన్నారు. రోస్టర్ విధానాన్ని తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.


Next Story

Most Viewed