రాజ్యసభ కమిటీల్లో చోటు దక్కించుకున్న తెలుగు రాష్ట్రాల ఎంపీలు వీళ్లే

by Nagaya |
రాజ్యసభ కమిటీల్లో చోటు దక్కించుకున్న తెలుగు రాష్ట్రాల ఎంపీలు వీళ్లే
X

దిశ, వెబ్‌డెస్క్ : రాజ్యసభ నూతన స్టాండింగ్ కమిటీలను రాజ్యసభ చైర్మన్ జగధీప్ ధన్కర్ ప్రకటించారు. ఈ మేరకు రాజ్య సభ సెక్రటరీ పీసీ మోడి బుల్లెటిన్ జారీ చేశారు. తాజాగా రాజ్యసభ ప్రకటించిన తొమ్మిది కమిటీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలకు స్థానం దక్కింది. బిజినెస్ అడ్వైజరీ కమిటీ, ఎథిక్స్ కమిటీల్లో కె.కేశవ రావు(టీఆర్ఎస్), విజయ సాయి రెడ్డి(వైఎస్సార్సీపీ)లకు చోటు దక్కింది. ఇక కమిటీ ఆన్ రూల్స్ లో డాక్టర్ కె.లక్ష్మణ్(బీజేపీ), కమిటీ ఆన్ ప్రివిలైజెస్ లో జీవిఎల్ నర్సింహారావు(బీజేపీ), కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్ లో కేఆర్ సురేశ్ రెడ్డి (టీఆర్ఎస్)లకు అవకాశం కల్పించారు. అలాగే హౌజ్ కమిటీ చైర్మన్ గా సీఎం రమేశ్(బీజేపీ) నియామకం అయ్యారు. అదేవిధంగా హౌజ్ కమిటీ సభ్యుడిగా బడుగుల లింగయ్య(టీఆర్ఎస్)కు స్థానం దక్కింది.



Next Story

Most Viewed