టీటీడీపీ అధ్యక్షుడు కాసాని ఇంట తీవ్ర విషాదం

by Disha Web Desk 2 |
టీటీడీపీ అధ్యక్షుడు కాసాని ఇంట తీవ్ర విషాదం
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ మాతృమూర్తి కౌసల్య (93) మంగళవారం రాత్రి కన్నుమూసింది. అనారోగ్య సమస్యలతో ఆమె గత నెల రోజులుగా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు కాసాని జ్ఞానేశ్వర్ స్వగ్రామం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లిలో కౌసల్య అంత్యక్రియలు నిర్వహిస్తారు. కౌసల్య బాచుపల్లి సర్పంచ్‌గా పనిచేశారు. ఆమె మృతికి పలు పార్టీల నాయకులు ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు.


Next Story

Most Viewed