- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
'మునుగోడులో గెలిచిన రెండ్రోజులకే.. వారిని మోసం చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తోంది'

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచి రెండ్రోజులు గడవక ముందే గొల్లకుర్మలను మోసం చేయాలని చూస్తోందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కిలి ఐలయ్య యాదవ్ ఆరోపించారు. మంగళవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. బైపోల్ కు ముందు గొర్రెల పంపిణీ పథకం లో భాగంగా గొర్రెలకు బదులుగా యూనిట్ విలువ నగదు ఇస్తామని, మునుగోడు ను పైలట్ ప్రాజెక్టుగా చేస్తూ, డీడీలు కట్టిన నియోజకవర్గంలోని 4,720 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో నగదు జమ చేసి ఆ ఖాతాలను ప్రభుత్వం ప్రీజ్ చేసిందన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం ఈ నగదును డ్రా చేసుకోవచ్చని మోసపూరితమైన మాటలతో గొల్ల కురమ్మ లను మభ్య పెట్టారన్నారు.
ఇప్పుడు గొర్రెల పంపిణీ పథకం పాత పద్ధతిలోనే కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లుగా వార్తలు వస్తున్నాయన్నారు. గొర్రెలను వేరే రాష్ట్రాల నుంచి లబ్దిదారులు కొనుగోలు చేయలేరనే నెపంతో మధ్య దళారులకు దోచి పెట్టేందుకు నగదు బదిలీని నిలిపివేసి లబ్దిదారులను మోసం చేయాలనే యత్నం మానుకోవాలని సూచించారు. మునుగోడులో ప్రీజ్ చేసి గొల్ల కుర్మల బ్యాంకు ఖాతాలను వెంటనే రిలీజ్ చేసి నగదును డ్రా చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. గొర్రెల పంపిణీలో నగదు బదిలీపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.