కాళేశ్వరంపై కాంగ్రెస్ లాలూచీ.. T-బీజేపీ సంచలన ట్వీట్

by Disha Web Desk 4 |
కాళేశ్వరంపై కాంగ్రెస్ లాలూచీ.. T-బీజేపీ సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ గడువు ముంచుకోస్తుండటంతో ప్రధాన పార్టీల మధ్య ట్విట్టర్ వార్ పీక్స్‌కు చేరింది. పార్టీల విధానాలపై మూడు ప్రధాన పార్టీలు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నాయి. ప్రజలకు తొందరగా తమ కాన్సెప్ట్ తెలిసేలా.. ఫొటోలు, వీడియోలను ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీపై ట్విట్టర్ వేదికగా టీ-బీజేపీ ఫైర్ అయింది. కాళేశ్వరంపై కనిపించని చిత్తశుద్ధి.. గత పాలకులతో కాంగ్రెస్ లాలూచీ అని ఓ వీడియో విడుదల చేసింది. మాట మర్చిపోవడమే మార్పు అని..కాళేశ్వరంపై కొరవడిన చిత్తశుద్ధి అంటూ మండిపడింది. అధికారం రాకముందు కాళేశ్వరం అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ చేయిస్తామని కాంగ్రెస్ వాగ్ధానం చేసిందని .. అధికారం వచ్చాక హడావిడే కానీ విచారణపై నోరెత్తడం లేదని ఫైర్ అయింది.

Next Story