ఇద్దరు కోటీశ్వరుల చేతిలో స్రవంతి ఓడిపోయింది: జైరాం రమేష్

by Mahesh |   ( Updated:2022-11-07 07:33:08.0  )
ఇద్దరు కోటీశ్వరుల చేతిలో స్రవంతి ఓడిపోయింది: జైరాం రమేష్
X

దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఉప ఎన్నికలో మద్యం, మనీ గెలిచిందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ జైరాం రమేష్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన పాల్వాయి స్రవంతి.. ఇద్దరు కోటీశ్వరులైన, రాజగోపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిల చేతిలో ఓడిపోయింది. కానీ పాల్వాయి స్రవంతి చాలా ధైర్యం ఉన్న వ్యక్తి అని జైరాం రమేష్ అన్నారు. అలాగే మునుగోడు ఫలితంపై సమీక్ష చేస్తామని చెప్పుకొచ్చారు. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడిపోవడం సంతోషంగా ఉందని.. వెంకట్ రెడ్డికి ఏఐసీసీ నోటీసులు ఇచ్చారు. దానికి వెంకట్ రెడ్డి సమాధానం ఇస్తే ఎఐసీసీ చూసుకుంటుందని.. తెలంగాణలో టీఆర్ఎస్ కు ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ జైరాం రమేష్ అన్నారు.



Next Story