- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
చిన్నారుల్లో డిప్తీరియా దడ

దిశ, తెలంగాణ బ్యూరో: చిన్నారుల్లో డిప్తీరియా వ్యాధి దడ పుట్టిస్తోన్నది. గత రెండు నెలల నుంచి ఈ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ అంచనా వేసింది. 2015లో దేశ వ్యాప్తంగా కేవలం 35 శాతం మంది చిన్నారుల్లో తేలగా, ఇప్పుడు ఏకంగా 65 శాతానికి పెరిగినట్లు ఆఫీసర్లు అంచనా వేశారు. గడిచిన రెండు సంవత్సరాలుగా కొవిడ్కారణంతో స్కూళ్లన్నీ బంద్చేయబడ్డాయి. దీంతోనే వ్యాధి పెరిగి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో సోమవారం నుంచి డిప్తీరియా నిర్మూలనకు ఇచ్చే టీడీ వ్యాక్సిన్ల డ్రైవ్ ను షురూ చేయనున్నారు.10 నుంచి 16 ఏళ్ల పిల్లలకు ఈ టీకా ఇవ్వనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 14 లక్షల మందికి పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో ఈ టీకాను పంపిణీ చేయనున్నారు. దీంతోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పంపిణీ చేయనున్నారు. పిల్లల లెప్ట్హ్యాండ్కు 0.5 ఎంఎల్ డోసు ఇవ్వనున్నారు. కొరినే బ్యాక్టిరీయా డిప్తీరియా అనే బ్యాక్టీరితో ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధితో బాధపడుతున్న పిల్లలు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు గాలి తుంపర్ల ద్వారా ఈ వ్యాధి మరోకరికి వ్యాపిస్తుంది. ఎక్కువ జనసాంద్రత ఉన్న ప్రాంతాలలో భారీగా వ్యాప్తి ఉంటుంది. చిన్న పిల్లలలో వ్యాధి నిరోధక టీకాలు సక్రమంగా ఇవ్వకపోవడంతో వ్యాధి నిరోధక శక్తి తగ్గి ఈ వ్యాధి సోకుతుందని డాక్టర్లు చెబుతున్నారు.