SLBC టన్నెల్ ప్రమాదం.. రెస్కూ ఆపరేషన్‌కు 3 నెలల బ్రేక్

by Mahesh |   ( Updated:2025-04-26 04:02:07.0  )
SLBC టన్నెల్ ప్రమాదం.. రెస్కూ ఆపరేషన్‌కు 3 నెలల బ్రేక్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన SLBC టన్నెల్ ప్రమాదం (Tunnel accident)లో 8 మంది గల్లంతవ్వగా.. వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్ (Rescue operation) కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే వారిలో ఇద్దరి మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీయగా.. మరో ఆరుగురి కోసం తవ్వకాలు జరుపుతున్నారు. దాదాపు 63 రోజుల పాటు కొనసాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్‌కు ఈ రోజు బ్రేక్ (Break) పడింది.. దీంతో టన్నెల్‌లో నిర్వరామంగా వర్క్ చేసిన ఎక్స్‌కవేటర్లు బయటకు వచ్చాయి. ఈ రెస్క్యూలో శిథిలాల తొలగింపు దాదాపు పూర్తి అయినట్లు సమాచారం. కేవలం డేంజర్ జోన్‌లో మాత్రమే శిథిలాలను తొలగించాల్సి ఉన్నట్లు అధికారులు తెలిపారు. సాంకేతిక కమిటీ సూచనల మేరకు మూడు నెలల పాటు ఈ సహాయక చర్యలను (Relief efforts suspended for months) నిలిపివేశారు. తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ప్రతిష్టాత్మకంగా తీసుకుని కొనసాగిస్తున్న ఈ SLBC టన్నెల్ ప్రాజెక్టులో.. ఫిబ్రవరి 22న ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) సొరంగంలో కొనసాగుతున్న సహాయక చర్యలను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని సాంకేతిక కమిటీ (Technical Committee) నిర్ణయించింది. సొరంగంలోని ఇన్‌లెట్‌ వైపు నుంచి 13.6 కి.మీ తర్వాత ముందుకెళ్లడం ఏమాత్రం సురక్షితం కాదని కమిటీ అభిప్రాయపడింది. దీంతో గురువారం జలసౌధలో సాంకేతిక కమిటీ సమావేశం రెవెన్యూ శాఖ (విపత్తులు) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ అధ్యక్షతన జరిగింది. దీనికి ఫైర్‌ సర్వీసెస్‌ డీజీ నాగిరెడ్డి, నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌తో పాటు ఏపీలోని ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ పదో బెటాలియన్‌ కమాండెంట్‌, నేషనల్‌ జియోఫిజికల్‌ పరిశోధనా సంస్థ డైరెక్టర్‌, జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా డిప్యూటీ డైరెక్టర్‌, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ భూశాస్త్రవేత్త, బార్డర్‌ రోడ్‌ ఆర్గనైజేషన్‌ (బీఆర్‌వో) సంస్థ నుంచి టన్నెల్‌ నిపుణులు పరీక్షిత్‌ మెహ్రా హాజరయ్యారై ఈ నిర్ణయం తీసుకున్నారు.



Next Story

Most Viewed